contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

యూసఫ్ గూడ లో దారుణ హత్య

హైదరాబాద్​లో దారుణ హత్య చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 11 గంటల తర్వాత యూసుఫ్​గూడాలోని లక్ష్మీనరసింహనగర్​లో 10 మంది దుండగులు స్థిరాస్తి వ్యాపారి మర్మంగాలు కోసి, కత్తులతో పొడిచి పాశవికంగా దాడి చేసి హత్య చేశారు. మృతుడిని నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ వాసి పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న(35)గా గుర్తించారు. జూబ్లీహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

సినిమాను తలపించేలా హత్య – వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

పోలీసుల విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. సింగోటం రాము హత్యకు ముందు రాముకు ఓ యువతి ఫోన్​ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మణికంఠ అనే వ్యక్తి యువతితో ఫోన్​ చేయించి, యూసుఫ్​గూడాకు రప్పించినట్లు తేలింది. మణి, రాముల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నాయని, కొన్ని నెలల క్రితం ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని పోలీసులు తెలిపారు. బషీరాబాద్​లో పరస్పరం కేసులు పెట్టుకున్నారని దర్యాప్తులో తేలిందని చెప్పారు.

ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన భార్య – ఆపై కిడ్నాప్ డ్రామా

రామును హత్య చేసిన తర్వాత మణికంఠ రాము స్నేహితుడిని కాల్​ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘రాముని చంపాను, వచ్చి డెడ్​ బాడీ తీసుకెళ్లు’ అని చెప్పాడని, రామును హత్య చేసిన తర్యాత మణికంఠ బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నాడని చెప్పారు. ప్రస్తుతం మణికంఠ పరారీలో ఉండగా, రాముకి ఫోన్​ చేసిన యువతిని జూబ్లీహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో విచారిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :