contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తూప్రాన్ పోలీసుల హెచ్చరిక

తూప్రాన్ :పశువుల దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో గొర్రెలు, మేకలను సురక్షితమైన షెడ్లలో ఉంచడంతో పాటు, షెడ్ల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టాలని హెచ్చరించారు.

తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్లాపూర్ గ్రామానికి చెందిన నరేందర్ తన మేకలు, గొర్రెలను రాత్రి సమయంలో షెడ్‌లో ఉంచాడు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు షెడ్‌లోకి ప్రవేశించి ఐదు మేకలను అపహరించుకెళ్లినట్లు నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు మేరకు తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడంతో పాటు అనుమానితుల కదలికలపై నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల సూచనలు

  • మేకలు, గొర్రెలను రాత్రి వేళల్లో సురక్షితమైన షెడ్లలో ఉంచాలి.
  • షెడ్ల వద్ద వీలైనంత వరకు సీసీటీవీ కెమెరాలు, లైటింగ్, పటిష్టమైన తాళాలు ఏర్పాటు చేసుకోవాలి.
  • రాత్రి సమయంలో షెడ్ల వద్ద సెక్యూరిటీ లేదా కాపలాదారులను ఏర్పాటు చేసుకోవాలి.
  • అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాల కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
  • గ్రామాల్లో పశువుల దొంగతనాల నివారణకు ప్రజలు పోలీసులతో సహకరించాలి.

ప్రజల అప్రమత్తతతో పశువుల దొంగతనాలను అరికట్టవచ్చని తూప్రాన్ పోలీసులు తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పద కదలికలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :