contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఆర్మూర్-జగిత్యాల హైవేకు లైన్ క్లియర్.. మూడేళ్లలోనే

  • ఆర్మూర్-జగిత్యాల హైవేకు లైన్ క్లియర్
  • అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరు
  • మూడేళ్లలో అందుబాటులోకి రానున్న హైవే

 

ఆర్మూరు, జగిత్యాల, మంచిర్యాల ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఆర్మూరు-జగిత్యాల-మంచిర్యాల హైవే నిర్మాణానికి ప్రధానమంత్రి కార్యాలయం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. త్వరలో టెండర్లు పిలిచి, మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయనున్నారు. NH 63 ను నాలుగు వరుసలుగా విస్తరించనుండగా, పట్టణాలు, గ్రామాల వద్ద బైపాస్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు ఖర్చు కానుంది.
ఇది మహారాష్ట్రలోని దౌండ్ వద్ద మొదలై తెలంగాణ, ఛత్తీస్ గఢ్ మీదుగా 1,065 కి. మీ. కొనసాగి ఒడిశాలోని కోరాపుట్లో ముగుస్తుంది. తెలంగాణలో బోధన్ -నిజామాబాద్-ఆర్మూరు-మెట్ పల్లి- కోరుట్ల-జగిత్యాల-లక్సెట్టిపేట-ధర్మపురి- మంచిర్యాల-చెన్నూరు మీదుగా సాగుతుంది. ఇందులో నిజామాబాద్ నుంచి ఆర్మూరు శివారులోని ఎన్హెచ్ 44 వరకు, తిరిగి మంచిర్యాల దాటిన తర్వాత ఉండే ఎన్హెచ్ 363 నుంచి ఛత్తీస్గఢ్ సరిహద్దు చెన్నూరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ రహదారుల విభాగం విస్తరిస్తోంది. ఆ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు కీలక నిర్మాణం అయినందున దాన్ని ఎన్హెచ్ఎఐకి అప్పగించారు.

ఆర్మూరు-మంచిర్యాల రోడ్డు పట్ణణాలు, గ్రామాల మీదుగా కొనసాగుతున్నందున, దాన్ని గ్రీన్ఫీల్డ్ హైవేగా నిర్మించాలని తొలుత నిర్ణయించారు. ఇందుకు భారీగా ప్రైవేట్ భూములు సేకరించాల్సి రావటంతో రైతులు ఎదురుతిరిగారు. దీంతో ఊళ్లున్న ప్రాంతాల్లో బైపాస్లు నిర్మించి మిగతా పాత రోడ్డును విస్తరించేలా ప్రణాళిక రూపొందించారు. మధ్యలో ఓ పర్యాయం టెండర్లు పిలిచినా.. చివరకు సాంకేతిక కారణాలతో రద్దు చేసుకున్నారు. తాజాగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతూ వస్తున్న కీలక రహదారులను వేగంగా పూర్తి చేసేలా జాబితాను రూపొందించింది. దీనిలో మొత్తం 3 వేల కి.మీ. నిడివి ఉండే రోడ్లను చేర్చారు. ఇలా చేర్చిన జాబితాలో తెలంగాణ నుంచి జగిత్యాల–కరీంనగర్, ఆర్మూరు–మంచిర్యాల రోడ్లను కూడా చేర్చారు. వీటిని స్వయంగా ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తుంది.

ప్రధాని కార్యాలయం పర్యవేక్షిస్తుంది… ఈ మేరకు ఈ రోడ్లకు లైన్ క్లియర్ అయ్యింది.

ఆర్మూరు నుంచి మంచిర్యాల వరకు రోడ్డు నిడివి 131.8 కి.మీ. ఇందులో పలు పట్టణాలు, పెద్ద గ్రామాలున్నందున చాలా ప్రాంతాల్లో బైపాస్లను నిర్మించనున్నారు. ఆర్మూరు, మెట్ పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట, మంచిర్యాల పట్టణాల వద్ద 6 కి.మీ. నుంచి 12 కి.మీ. మేర భారీ బైపాస్లు ఉంటాయి. ఇవి కాకుండా మరో ఎనిమిది ప్రాంతాల్లో చిన్న బైపాస్లు నిర్మిస్తారు. మొత్తంలో 105 కి.మీ. బైపాస్లో ఉండటంతో గ్రీన్ఫీల్డ్ హైవేగానే ఉండనుంది. దీన్ని యాక్సెస్ కంట్రోల్డ్ తరహాలో నిర్మించాలని ప్రతిపాదించినా, కేంద్రం ఇంకా దానికి అనుమతి ఇవ్వలేదు.

1: ఆర్మూరు నుంచి మెట్ పల్లి 35.9 కి.మీ
2: మెట్ పల్లి నుంచి జగిత్యాల 28.7 కి.మీ.
3: జగిత్యాల నుంచి రాయపట్నం 31.9 కి.మీ.
4: రాయపట్నం నుంచి మంచిర్యాల 35.39 కి.మీ.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :