అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటీయూసీ, స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియుసి ఆధ్వర్యంలో వేరువేరుగా జండాలను ఆవిష్కరించి ఘనంగా అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శులు సిపిఎం నిర్మల, సిపిఐ రామదాసు మాట్లాడుతూ మే డే సందర్భంగా కఠినమైన కార్మిక చట్టాలను రద్దుచేసి రాష్ట్రంలో లేబర్ యాక్ట్ ప్రకారం అకస్మాత్తుగా కార్మికుడు చనిపోతే అలాగే మహిళా కార్మికురాలు ప్రసవ సమయంలో పదివేల రూపాయలు ఆర్థిక సహాయం కుందేలా కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులు పొందేందుకు మే 20వ తారీకున దేశవ్యాప్తంగా పోరాట ఉద్యమాలు చేపడతాము కాబట్టి అంగన్వాడీ వర్కర్లు, ఆటో కార్మికులు, మున్సిపాలిటీకి చెందిన పారిశుద్ధ కార్మికులు అమాలి కార్మికులు ఆశా వర్కర్లు తదితర కార్మికులు ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం సీనియర్ నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు
