తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో గురువారం దామలచెరువు గ్రామం నందు ఎస్ అశోక్ కుమార్ (52) సంవత్సరాలు గల వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అశోక్ కుమార్ ను బలమైన రాళ్లతో కొట్టి కింద పడిన తర్వాత వేట కొడవళ్లతో నరికి చంపారు. దామలచెరువు చెందిన వేణుగోపాల శెట్టి కుమారుడు ఎస్. అశోక్ కుమార్ గ్రామంలో మెడికల్ షాప్తో పాటు మామిడి కాయల వ్యాపారం కూడా ఉంది. హత్య అనంతరం అతని ఒంటిపై ఉన్న బంగారం దుండగులు అపహరించినట్లు సమాచారం. ఘటనపై పాకాల పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. హత్యకు కారణమైన అంశాలను తెలుసుకునేందుకు పోలీసులు వివిధ కోణాలలో విచారణ కొనసాగిస్తున్నారు.
