ఆంధ్రప్రప్రదేశ్ సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. ఈ మధ్యాహ్నం 2.48 గంటలకు 3 వేల మందితో టీడీపీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.
టీడీపీలో చేరబోతున్న తరుణంలో కన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది బీజేపీ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పారు. వారు కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గుంటూరు లోని తన నివాసం నుంచి కన్నా లక్ష్మీనారాయణ భారీ ర్యాలీతో బయల్దేరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.