కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: తెలంగాణ రాష్ట్రంలోని 2 వేల జనాభా కలిగిన జిపీలలో మండలంలోని ఖాసీంపేట గ్రామం స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో ముందు వరసలో నిలిచింది. గ్రామంలోని వాడవాడలో పరిశుభ్రత, పారిశుధ్యంలో మెరుగ్గా ఉండటం వలన గ్రామాన్ని కన్సల్టెంట్ డిడిడబ్ల్యూఎస్ అధికారి సాక్షి శ్రీ వాస్తవ, ఎస్ ఎస్బిజిఎం డైరెక్టర్ సురేష్ కుమార్, ఐఇసి కన్సల్టెంట్ అధికారి శ్యాం కుమార్ అధికార బృందం శుక్రవారం ఖాసీంపేట గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,ఓసి ఇంటింటికి తిరిగి ఇంకుడు గుంతలు, మరుగుదొడ్ల వినియోగం, కిచెన్ గార్డెన్, సోఫిట్, వారసంత, కంపోస్ట్ షెడ్, డ్రైనేజ్ ఎండ్ సోక్ ఫిట్, పల్లె ప్రకృతి వనంలో పిల్లల ఆట వస్తువులు,తడి చెత్త పొడి చెత్త విధానాన్ని పరిశీలించారు. గ్రామాన్ని నీటుగా, క్లీన్ గా ఉంచడం వలన గ్రామ సర్పంచి గంప మల్లీశ్వరి వెంకన్న, పాలకవర్గం సభ్యులను అధికారులు అభినందించారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి జిపి ఆదర్శంగా నిలువాలని కోరారు. అనంతరం అధికారులకు బతుకమ్మ, పోలే బొకే ఇచ్చి శాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్ధం సంపత్ రెడ్డి, డిపిఓ వీర బుచ్చయ్య, డి ఆర్ డి ఓ శ్రీలత, ఎంపీడీవో స్వాతి, ఎంపీ ఓ నరసింహారెడ్డి, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎస్ బి ఎం కోఆర్డినేటర్ రమేష్, మండల, గ్రామ అధికారులు, జి పి సిబ్బంది పాల్గొన్నారు.
