కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా : కాగజ్ నగర్ రూరల్ మండలంలసని అంకూషాపూర్ గ్రామంలో రైతులు భూమి దున్నుకోకుండా అడ్డుకోవడంతో గ్రామ రైతులందరూ సహాయం చేయాలని కోరడంతో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ లోని ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సుశాంత్ ను తన కార్యాలయంలో కలసి. అంకుశాపూర్ గ్రామస్థులంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారని,వారు కేవలం తిండి కోసమే పంట వేసుకుంటారని,అది కూడా కేవలం ఏడాదికి వర్షాకాలంలో ఒక్కటే పంట వేసుకొని బతుకుతారని పంట వేసుకోకపోతే వారు బతకడం కష్టమని డిఎఫ్ఓ కి వివరించారు. అటవీ చట్టాల పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.డిఎఫ్ఓ సానుకూలంగా స్పందించి,గ్రామస్థులతో చర్చించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
