నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం,చుంచులూరు ఉన్నత పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఉపాధ్యాయులు అశోక్, మురళీకృష్ణ, సయీం లను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు అందరూ ఎంతో నిబద్ధతతో, అంకితభావంతో పనిచేసి పాఠశాల అభివృద్ధికి,విద్యార్థుల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని, వారు చేసిన సేవలను ఘనంగా కొనియాడారు.పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ కు సన్మానం చేస్తున్న సందర్భంలో విద్యార్థులు ఉద్వేగాన్ని ఆపుకోలేక, వారితో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి జొన్నా సత్యనారాయణ, విశ్రాంత ఉపాధ్యాయురాలు అరుణ, గ్రామానికి చెందిన రాజేంద్ర కుమార్, సుబ్బయ్య, ఉపాధ్యాయులు డీ.వీ.రమణయ్య, మల్లికార్జున స్వామి,పెంచలరావు, బాలాజీ, తిరుపాలు, రహీమ, శ్రీనివాసులు, సునీత తదితరులు పాల్గొన్నారు.
