contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మందుల చీటి తెలుగులో స్పష్టంగా ఉండాలి…సౌజన్య ఆసుపత్రి తనిఖీలో జిల్లా కలెక్టర్

పార్వతీపురం: వైద్యులు రాసే మందుల చీటీలు సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఉండాలని, ప్రతి మందు ఎప్పుడు వాడాలో స్పష్టంగా తెలుగులో పేర్కొనాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.

బుధవారం కలెక్టర్ పార్వతీపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులోని సౌజన్య ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించిన ఆయన, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన చికిత్స అందించాలని యాజమాన్యానికి సూచించారు.

ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా

ఆసుపత్రిలో అమలవుతున్న ప్రభుత్వ వైద్య పథకాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా ‘డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలు’, ఈహెచ్ఎస్ పథకాల అమలు తీరును పరిశీలించి, అవి అర్హులైన రోగులకు సక్రమంగా అందుతున్నాయా అనే అంశంపై ‘వైద్యమిత్ర’ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, పథకాల కింద నమోదైన కేసుల వివరాలను సమీక్షించారు.

రోగుల నుండి ఫీడ్‌బ్యాక్ సేకరణ

ప్రభుత్వ వైద్య సేవలు పొందుతున్న రోగులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడి, వారికి ఎదురవుతున్న సమస్యలు, సిబ్బంది ప్రవర్తనపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, సేవల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.

ఈ పర్యటనలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ రావు, ఆసుపత్రి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :