contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రూ.30 వేల లంచం.. ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ

జగిత్యాల జిల్లా, బీర్పూర్: బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. ఓ మహిళ నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటుండగా ఆర్ఐ రాహుల్‌ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

స్థానికంగా అందిన వివరాల ప్రకారం.. తహసీల్దార్ కార్యాలయంలో తనకు సంబంధించిన ఓ పని నిమిత్తం వెళ్లిన మహిళను ఆర్ఐ రాహుల్ డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత మహిళ ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు. గురువారం బాధిత మహిళ ఆర్ఐ రాహుల్‌కు రూ.30 వేల నగదు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు సమాచారం.

డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్

ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ ట్రాప్ నిర్వహించినట్లు తెలుస్తోంది. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఐను అదుపులోకి తీసుకున్న అధికారులు తదుపరి విచారణ చేపట్టినట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ పని కోసం లంచం డిమాండ్ చేశారు? ఇతర అధికారులు లేదా సిబ్బంది ప్రమేయం ఉందా? అనే అంశాలపై ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో బీర్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :