contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

బెజ్జూర్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీని గ్రామ, బూత్ స్థాయిల నుంచి మరింత బలోపేతం చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం బెజ్జూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షురాలు పంద్రం పుష్పలత అధ్యక్షతన నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ మండల సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యలపై చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత కల్పించడమే సంఘటన్ సృజన్ అభియాన్ ప్రధాన ఉద్దేశమని ఆత్రం సుగుణక్క, దండే విఠల్ తెలిపారు. గ్రామాలు, బూత్‌ల వారీగా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారు పార్టీ శ్రేణులకు సూచించారు. అదే సమయంలో స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో పనిచేస్తే గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :