contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం బీఆర్‌ఎస్‌ భారీ నిరసన

గోదావరిఖని: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మున్సిపల్‌ కార్యాలయ పరిసరాలు మార్మోగాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. హామీల అమలుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంతో గోదావరిఖని ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :