contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

140 కోట్లు కొట్టేసిన యాపిల్ కంపెనీ ఉద్యోగి

తిండి పెడుతున్న కంపెనీని మోసం చేశాడో ఉద్యోగి.. ఒకటి, రెండుసార్లు కాదు, ఏకంగా ఏడేళ్లపాటు మోసం చేస్తూనే ఉన్నాడు. మరో ఇద్దరితో జత కలిసి పక్కాగా దొంగతనం చేస్తూ వచ్చాడు. ఇలా ఏడేళ్లలో మొత్తం రూ.140 కోట్లను వాళ్లు కాజేశారు. దొంగతనం బయటపడడంతో ఆ ఘరానా దొంగ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘరానా దొంగతనం అమెరికాలోని యాపిల్ కంపెనీలో చోటుచేసుకుంది.

భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాద్ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీలో 2008లో చేరాడు. మూడేళ్ల తర్వాత సంస్థలో దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. దొంగ ఇన్వాయిస్ లు తయారు చేయడం, విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను కొట్టేయడం, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి చేశాడు. వచ్చిన సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. 2011 నుంచి 2018 వరకు ఇలా దాదాపు 17 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో 140 కోట్ల పైనే) కంపెనీ నుంచి కాజేశాడు.

ధీరేంద్ర ప్రసాద్ 2018 లో ఉద్యోగానికి రాజీనామా చేసి యాపిల్ సంస్థ నుంచి బయటికొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత తను చేసిన మోసానికి పశ్చాత్తాపంతో ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మోసంలో తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని పోలీసులకు వెల్లడించాడు. దీంతో ధీరేంద్రతో పాటు యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేసిన రాబర్ట్ గేరీ హన్సన్, డాన్ ఎమ్ బేకర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్ కేసు విచారణ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :