contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేదికి అరుదైన ఘనత

భారత్, జపాన్ దేశాలు తొలిసారిగా సంయుక్తంగా వైమానిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో భారత వాయుసేన స్క్వాడ్రన్ లీడర్ అవని చతుర్వేది కి అరుదైన ఘనత దక్కనుంది . విదేశాల్లో భారత్ తరఫున యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్న తొలి మహిళా పైలెట్ గా ఆమె నిలవనున్నారు. ఇండో-జపాన్ సంయుక్త విన్యాసాల్లో అవని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానంతో పాల్గొననున్నారు.

అవని 2018లో మిగ్-21 బైసన్ విమానం నడిపిన తొలి మహిళా పైలెట్ గా ఖ్యాతి గడించారు. ఆమె ఒక్కతే ఆ విమానాన్ని నడిపి అతివలు పురుషులకేమీ తీసిపోరని చాటారు. ఈ నేపథ్యంలో, జపాన్ లోని హయకురి వైమానిక స్థావరంలో నిర్వహించే వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాల్లో అవని సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జరగనున్నాయి. ఈ సంయుక్త విన్యాసాల కోసం భారత వాయుసేన నాలుగు సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలు, రెండు సీ-17 గ్లోబ్ మాస్టర్-III సైనిక రవాణా విమానాలు, ఐఎల్-78 గగనతల ఇంధన ట్యాంకర్ విమానం, 150 మంది సిబ్బందిని పంపిస్తోంది. అటు జపాన్ తన ఎఫ్-2, ఎఫ్-15 వంటి యుద్ధ విమానాలను రంగంలోకి దించుతోంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :