contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన

చందానగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, వివిధ డిక్లరేషన్లను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి మాదాపూర్ డివిజన్‌లో మూడో రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముక్కు శ్రీనివాసరెడ్డి, కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షాంబీపూర్ రాజ్ హాజరయ్యారు. అనంతరం చందానగర్‌లోని నన్ను లాలునాయక్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని షాంబీపూర్ రాజ్ ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్ల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు, హామీల అమలుపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ నిరసన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం, ఎన్నికల హామీల అమలు కోసం బీఆర్‌ఎస్ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని షాంబీపూర్ రాజ్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, రంగారావుతో పాటు వినోద్ రెడ్డి, కృష్ణంరాజు, సైదారావు, సుబ్బారావు, భరత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శివ, మల్లారెడ్డి, సంఘారెడ్డి, శ్రీనివాసరెడ్డి, కార్తీక్ రెడ్డి, రామకృష్ణ గౌడ్, విజయ రెడ్డి, సుబ్బరాజు, అల్లావుద్దీన్ తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మైనారిటీ వర్గాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :