contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తమిళనాడులో తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జీ నిర్మాణం … దేశంలోనే తోలి వర్టికల్ బ్రిడ్జీ

భారత్ నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్ లో అత్యంత ఎత్తైన బ్రిడ్జిని నిర్మించిన భారత ప్రభుత్వం… తాజాగా సముద్రంపై అవసరమైనప్పుడు పైకి లేచే విధంగా ఓ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తోంది. దీనిని రైల్వే మంత్రిత్వ శాఖ వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా పిలుస్తోంది. ఆ శాఖ ఆధ్వర్యంలోనే నిర్మాణం జరుగుతున్న ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ బ్రిడ్జి వివరాలను వెల్లడిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రకటనతో పాటు నిర్మాణంలో ఉన్న సదరు బ్రిడ్జి ఫొటోలను కూడా విడుదల చేసింది.

దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జిగా ఈ నూతన బ్రిడ్జి నిర్మాణం జరుపుకుంటోంది. తమిళనాడులోని రామేశ్వరంలో నిర్మితమవుతున్న ఈ బ్రిడ్జికి న్యూ పంబన్ బ్రిడ్జిగా రైల్వే శాఖ నామకరణం చేసింది. దాదాపుగా 63 మీటర్ల పొడవుతో సముద్రంపై నిర్మిస్తోంది,. ఈ బ్రిడ్జి మార్గంలో నీటిపై పడవలు, ఓడలు వెళ్లే సమయంలో ఎలాంటి అవాంతరం లేకుండా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఆ తర్వాత యధాతథంగా తిరిగి సాధారణ రూపంలోకి వచ్చి చేరుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :