కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా : మే 4వ తేదీన జిల్లాలో జరగనున్న నీట్ పరీక్ష నిర్వహణ కొరకు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో పరీక్ష నిర్వహణ కొరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 287 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. నీట్-2025 పరీక్ష సంబంధిత వివరాలు, సహాయం, సందేహాల నివృత్తి కొరకు కంట్రోల్ రూమ్ నం.6304686505 ఏర్పాటు చేయడం జరిగిందని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
