చంద్రగిరి : ఆర్థిక స్వయం సమృద్ధి కోసమే మహిళలకు టైలరింగ్ లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్టు తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి చెప్పారు. గురువారం స్థానిక పాకాల పట్టణం మరియు కే.వడ్డేపల్లి సచివాలయంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ పేదరికం పోగొట్టి మహిళల జీవన నాణ్యతను పెంపొందించడానికి టైలరింగ్ శిక్షణ దోహదపడుతుందన్నారు. ఇది ఎక్కువ ఆదాయం సంపాదించడంతోపాటు మహిళల ఆర్థిక స్వతంత్రతకు బాటలు వేస్తుంది అన్నారు.దీంతోపాటు మహిళలు వారి తల్లిదండ్రులు భర్తపై ఆధారపడకుండా కుటుంబ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందన్నారు. అందువల్ల కుట్టు మిషన్ల శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకొని టైలరింగ్లో నైపుణ్యం సాధించాలన్నారు. ప్రధానంగా మహిళా సాధికారత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు మహిళలకు ఎన్నో గొప్ప అవకాశాలు కూటమి ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పథకాలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు బీజాన్ని వేసింది కూడా చంద్రబాబునాయుడు అని గుర్తు చేశారు.నేడు బ్యాంకుల్లో ఎటువంటి పూచికత్తు లేకుండా 20 లక్షల రూపాయలు రుణాన్ని పొందుతున్నట్టు పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని మహిళలందరూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో చేపడుతున్న ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రం, జ్యూట్ బ్యాగ్, స్వయం ఉపాధి అవకాశాలు, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఇతర పథకాలలో మహిళలు పాల్గొని చంద్రగిరి నియోజవర్గానికి గొప్ప పేరు తేవాలని మహిళలకు పులివర్తి సుధా రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
