contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

317 జీవో పైన ప్రభుత్వం సబ్ కమిటీ వేయడం హర్షనీయం

  • సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్

కరీంనగర్ జిల్లా: తెలంగాణ నూతన ప్రభుత్వం 317 జీవో పైన ముగ్గురు మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దుల్ల శ్రీధర్ బాబు,పొన్నం ప్రభాకర్ గార్లతో సబ్ కమిటీ వేయడం హర్షనీయం అని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ అన్నారు. శనివారం గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి లో విలేకరులతో మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల లోపే ఉద్యోగ ఉపాధ్యాయులకు గుది బండ గా మారిన 317 జీవో ను పూర్తిగా అధ్యయనం చేసి జీవో 370 గురి అయిన ఉద్యోగ ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు.ఈ సబ్ కమిటీ రిపోర్ట్ కోసం తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల సలహాలు,సూచనలు తీసుకోవాలని అన్నారు. 317 జీవోతో సిపిఎస్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఈ సబ్ కమిటీతో 317 సిపిఎస్ ఉద్యోగులకు లాభం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాను ప్రాతిపదికన చేసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు బదిలీలు అవకాశం ఇవ్వాలని అలా అయితేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ సబ్ కమిటీ వేయడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ఉద్యోగులందరూ ఆశిస్తున్నారని అన్నారు. సిపిఎస్ రద్దు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ చేపట్టాలని కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :