contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi : గ్రంథాలయానికి దారేది ? .. పట్టించుకోని పల్నాడు కలెక్టర్

  • గ్రంథాలయం దారికి మోక్షం లభించినట్లేనా….!!!?
  • దారికి అడ్డుగా ఉన్న బడ్డీ బంకు తొలగింపు సాధ్యమేనా…..
  • పంచాయతీకి ఆదాయమా…. ప్రజలు అభీష్టమా…!
  • పంచాయితీ పాలకులు అధికారులు ఆదాయం ముఖ్యమా.. ప్రజల కోరిక నెరవేరుస్తారా…?

 

పల్నాడు జిల్లా కారంపూడి : కారంపూడి – మాచర్ల ప్రధాన రహదారిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కనే గ్రంథాలయం ఉందనేది గ్రామ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు.. ఈ మధ్యకాలంలో దారికి అడ్డుగా ఉన్న బడ్డీ బంకును తొలగించడం జరుగుతుంది, ఇది నామమాత్రమా లేక మరొక బడ్డి బంకును ఏర్పాటు చేస్తారా .. అనేది అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.  గ్రామ ప్రజలు మాత్రం గ్రంథాలయం ఉందనేది మర్చిపోయామని ప్రస్తుతం ప్రధాన రహదారికి గ్రంధాలయం స్పష్టంగా కనపడకపోవడంతో ప్రజల్లో గ్రంథాలయం ఉందా అనే ప్రశ్న మొదలైంది. గ్రామంలో గ్రంథాలయం ఉన్నయెడల విద్యార్థులు మేధావులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి గ్రంథాలయంలోని పేపర్లు మరియు కొన్ని పుస్తకాలను చదువుకుంటూ తమ మేదోశక్తిని పెంచుకుంటూ ఎన్నో విషయాలను తెలుసుకుంటు ఉంటారు. గ్రంథాలయాన్ని బహిరంగంగా కనపడేలా ఉంచాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.  గ్రంథాలయానికి అడ్డుగా ఉన్న బడ్డీ బంక్ ను తొలగించి గ్రామ ప్రజలు గ్రంధాలయానికి వీలుగా వెళ్లేందుకు దారిని ఉంచుతారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి.. ఏది ఏమైనా అడ్డుగా ఉన్న బంకును తొలగించి గ్రంథాలయాన్ని గ్రామ ప్రజలకు, విద్యార్థులకు మేధావులకు  ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవాలని గ్రామ ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రజా సమస్యలు పట్టించుకోని జిల్లా కలెక్టర్ జిల్లా లో ఉన్నారో లేదోనని ప్రజలకు అనుమానం క్యాక్తం చేస్తున్నారు. జిల్లాలో భూ మాఫియా, మరో ప్రక్క కాలం చెల్లిన బీర్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంటే .. తిరునాళ్ళకు వెళ్లి డ్యాన్సులు వేసుకోవడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని పలు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజా సమస్యల పై ద్రుష్టి పెట్టాలని కోరుతున్నారు స్థానికులు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :