contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పదేళ్ల టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం

మాసాయిపేట, తూప్రాన్, సెప్టెంబర్ 6: గత పదేళ్ల కాలంలో మాసాయిపేట గ్రామానికి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు కాలేదని గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి ఆరోపించారు. మాసాయిపేట మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

13 గ్రామాలను కలిపి మాసాయిపేట మండలం ఏర్పడిందని కృష్ణారెడ్డి తెలిపారు. నర్సాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి సహకారంతో మండల పరిధిలోని నాగ్సన్‌పల్లి, హకీంపేట గ్రామాలకు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి రోడ్డు నిర్మాణాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని ఆయన అన్నారు. ఆయా గ్రామాల్లో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్నాయని, కొందరు లబ్ధిదారులు గృహప్రవేశాలు కూడా నిర్వహించుకున్నారని తెలిపారు.

ఆవుల రాజిరెడ్డి సేవలను ప్రస్తావించిన సర్పంచ్

నర్సాపూర్ నియోజకవర్గంలో ఆవుల రాజిరెడ్డి తన ట్రస్టు ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యంగా ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందించడంతో పాటు కంటి ఆపరేషన్లు కూడా చేయించినట్లు తెలిపారు.

మాసాయిపేట మండల అభివృద్ధిపై బీఆర్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్.. ఆవుల రాజిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

గత పది సంవత్సరాల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ గ్రామంలోనైనా ఒక్క ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయా అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. మాసాయిపేట గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయో, గోమారం గ్రామానికి ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయో బీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు.

పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని వారు పేర్కొన్నారు. ఇకపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని సూచించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకుల వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా చంద్రగౌడ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కృష్ణారెడ్డి సూచించారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, సిద్ధరాములుగౌడ్‌తో పాటు 13 గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :