గిద్దలూరు : విధి నిర్వహణలో అంకితభావం, సమర్థతతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ ఈ.వి. రమణబాబుకు మరోసారి ఉత్తమ సేవా పురస్కారం లభించింది. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయనకు ఉత్తమ మున్సిపల్ కమిషనర్ అవార్డు దక్కడం పట్ల గిద్దలూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంతం ఏదైనా, ప్రదేశం ఏదైనా, జిల్లా ఏదైనా తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ అవార్డులు అందుకుంటున్న రమణబాబు సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. మున్సిపల్ పరిపాలనలో ఆయన చూపుతున్న చొరవ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
రమణబాబు పనితనం అభినందనీయమని, ఆయన ఆలోచనా విధానం ఆదర్శప్రాయమని ప్రజలు కొనియాడారు. ఆయన తీసుకునే నిర్ణయాల్లో అంకితభావం, ప్రజాసేవ పట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.
కఠిన శ్రమకు తగిన ప్రతిఫలంగా ఈ పురస్కారం లభించిందని, ఆయన అంకితభావం ఇతర అధికారులకు కూడా స్ఫూర్తిదాయకమని గిద్దలూరు ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ అవార్డు ఆయన ప్రతిభకు మరో గుర్తింపుగా నిలిచిందని పేర్కొన్నారు.
గిద్దలూరు పుర ప్రజలకు గర్వకారణం:
మున్సిపల్ కమిషనర్గా రమణబాబు అందిస్తున్న సేవలకు మరోసారి పురస్కారం లభించడం గిద్దలూరు పట్టణానికే గర్వకారణమని స్థానికులు అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకుని మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ మున్సిపల్ కమిషనర్ అవార్డు అందుకున్న ఈ.వి. రమణబాబుకు గిద్దలూరు పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.








