contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి : ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం సీతానగరం మండల కేంద్రంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, అధికారులు పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రతిజ్ఞ చేశారు.

ఎన్డీఏ, కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే విజయచంద్ర వెల్లడించారు. ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. “ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌కు పూర్తి స్థాయిలో నిరోధం అవసరం. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఇ-వేస్ట్ నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవాలి,” అని సూచించారు.

అలాగే పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. “పది వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించాలి,” అని పిలుపునిచ్చారు.

ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరిస్తే మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రజలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్, జిల్లా ప్రత్యేక అధికారి భరత్ కుమార్ గుప్తా, కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :