contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉపాధి పనులను కల్పించాలి : గిరిజన సంఘం డిమాండ్

అల్లూరి జిల్లా హుకుంపేట : జాతీయ ఉపాధి హామీ(ఎం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్)పనులు కల్పించాలని కోరుతూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హుకుంపేట ఎం పీ డీ ఓ కార్యాలయం ఆందోళనల చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపుల కృష్ణా రావు మాట్లాడుతూ…. భూర్జా పంచాయితీ, సులిపకోన్,కొండయ్య పాడు గ్రామాలకు చెందిన ఉపాధిహామీ కూలీలకు పనులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా నేటికి సులిపకోన్, కొండయ్య పాడు గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కల్పించక పోవడం దారుణం అన్నారు. నెలరోజుల ఉపాధి పనులు కల్పించనందుకు,నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు లేకా వలసలు వెళ్తున్నారు,ఎంతో ఉన్నత లక్ష్యం తో వలసల నివారణ కు ఉపాధిహామీ చట్టం చేస్తే,పనులు కల్పనలో అలసత్యం వహించడం సహించారాని నేరం అన్నారు. ఉపాధిహామీ హామీ పనులు కల్పనలో నిర్లక్ష్యం వహించిన అధికారుల పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి ,శాఖ పరమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. పనుల తక్షణమే కల్పించక పొతే,ఉపాధి హామీ కూలీల తో భారీ ఎత్తున మండల ఉపాధి ఏపీఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుకుంపేట మండల పరిషత్ వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణ్ రావు,గిరిజన సంఘం మండల అధ్యక్షుడు కిల్లో రామారావు,ఉపాధిహామీ కూలీలుమజ్జి.చంద్రన్న,చిట్టిబాబు,తులసి బాబు,చంటి, నన్నారావు,బాలన్న,రమేష్,నాగేష్,పండన్న తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :