- అబ్బూరు వి.ఆర్.వో వినోద్ పై ఎసిబి రైడ్
పల్నాడు జిల్లా సత్తెనపల్లి: అబ్బూరుకు చెందిన రైతు మానుకొండ నరసింహారావు మేనత్త పొలబోలు కోటమ్మ ,తక్కెళ్లపాటి వెంకాయమ్మ పొలం కొని దాఖలు డీడ్ చేసుకున్నది. ఆ పొలాన్ని ఆన్లైన్ చేయటానికి వి.ఆర్.ఓ వినోద్ లక్ష రూపాయలు లంచం అడిగాడు. 60 వేల రూపాయలు ఇచ్చిన, ఇంకా మిగిలిన నలభై వేల రూపాయలు ఇవ్వమని వి.ఆర్.ఓ డిమాండ్ చేయగా రైతు మానుకొండ నరసింహారావు ఏ.సీ.బి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి డిఎస్పి ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం నాడు రైడ్ జరిగింది. ఈ రెడ్ హ్యాండెడ్ 40 వేల రూపాయలు నగదుతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వీఆర్వో వినోద్ కుమార్ గతంలో సత్తెనపల్లి పట్టణంలోని సచివాలయంలో విధులు నిర్వర్తించారు.