కరీంనగర్ జిల్లా: మరో 20 రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న దృష్ట్యా అన్ని పాఠశాలల్లో సర్వీస్ పర్సన్లను నియమించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్ కట్టా రవీంద్ర చారి లు పేర్కొన్నారు. స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జరిగిన ఎస్టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయినందున ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని పెండింగ్లో ఉన్న డి ఏ లను సత్వరం మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం అమలులో వేసవి సెలవులలో పాఠశాల మరమ్మత్తు మరియు నూతన పనుల పర్యవేక్షణ చేస్తున్న అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అట్టి కాలానికి సంబంధించి సంపాదిత సెలవులను మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని 40 శాతం ఫిట్మెంట్తో నూతన పిఆర్సి ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణం పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలని, 317 జీవో అమలులో స్థానికత నష్టపోయిన ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని కార్యవర్గం డిమాండ్ చేసింది. వెంటనే సర్వీస్ రూల్స్ రూపొందించి అన్ని పర్యవేక్షణ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని కార్యవర్గం డిమాండ్ చేసింది ఈ కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఆర్ శ్రీనివాస్, కట్ట రవీంద్ర చారి జిల్లా ఆర్థిక కార్యదర్శి గుండ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు పిన్నింటి తిరుపతిరావు , సాన కిషన్, వెలిచాల వెంకటస్వామి, లక్ష్మణరావు జిల్లా నాయకులు వివేకానంద చారి, నామ్ పవన్ , రసూల్ , సంజీవ చారి, రజాక్ పాషా, కందుకూరి శ్రీనివాస్, మాధవస్వామి, సమ్మయ్య, రవీందర్, ముదిగంటి రాజేందర్రెడ్డి, తాటిపాముల శ్రీనివాస్,,మధు కుమార్ ,, చొప్పదండి రామకృష్ణ తదితరులతో పాటు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
