contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

భూమిలేని నిరుపేద కూలీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్

ఖమ్మం జిల్లా  భూమిలేని నిరుపేద కూలీలకు కాంగ్రెస్‌ సర్కార్ గుడ్​న్యూస్ చెప్పింది. పేద కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామన్న హామీని ఈనెల 28 నుంచి కాంగ్రెస్​ సర్కారు అమలు చేస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 దేశ స్వాతంత్య్రం కోసం ఏర్పడినటువంటి కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబరు 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6వేల రూపాయలు ఇస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి అన్నదాతలకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి, రైతన్నల కోసం నేరుగా రూ.50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్​ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.

ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కలిగించి ప్రజలను మోసం చేయడమే బీఆర్ఎస్​ నాయకులకు తెలుసని భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల విస్తరణకోసం ప్రజా ప్రభుత్వం కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌, వరంగల్‌ ప్రాంతాల్లో ఎయిర్​పోర్టుల ఏర్పాటు చేయనుందని వివరించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి తలమానికంగా మూసీని అభివృద్ధి చేయడానికి మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేపట్టామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :