contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి : గన్నేరువరం ఎస్సై నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా: గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్న గణేష్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన గణేష్ మండప నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htm లో వివరాలను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ వెబ్సైట్ నందు వినాయక మండప వివరాలు, వినాయక చవితి మొదలు, నిమజ్జన తేదీ, సమయం, ప్రయాణించే దారి, మండప ప్రదేశం, ప్రదేశం ఓనర్ వివరాలు, గణపతి విగ్రహ ఎత్తు, మండపం యొక్క ఎత్తు, నిమర్జనం ప్రదేశం, మండపము కు సంబంధించిన సమాచారం, గణపతి తీసుకువెళ్లే వాహన వివరాలు డ్రైవర్ మరియు యజమాని వివరాలు పొందుపరచాలని సూచించారు. అదేవిధంగా మండప నిర్వహకులు, గణపతి కమిటీ సభ్యులు, వాలంటీర్ల వివరాలు, ఫోన్ నెంబర్లు చిరునామా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా వివరాలు కాని సందర్భంలో గన్నేరువరం పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. భద్రత,బందోబస్తు కొరకే ఈ ఆన్లైన్ నమోదు విధానం ఉంటుందని చెప్పారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :