ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా : జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం ధాటికి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు.
మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు జరిగిన సమయంలో ఈ బాణసంచా తయారీ కేంద్రంలో 40 మంది కార్మికులు విధుల్లో ఉన్నారు.