contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో కార్మికుల తొలగింపు – విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు డిమాండ్

పిడుగురాళ్ల, అక్టోబర్ 13: పిడుగురాళ్ల ఆర్టీసీ డిపోలో వాషింగ్ సెక్షన్‌లో పని చేస్తున్న ఏడుగురు కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ, ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. డిపో మేనేజర్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణమే తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్టీసీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి. తులసీరామ్ మాట్లాడుతూ, ‘‘డిపో మేనేజర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్టర్ సెప్టెంబర్ 17న లేఖ ఇచ్చినా, మేనేజరు ‘కాంట్రాక్టర్ వస్తేనే విధుల్లోకి తీసుకుంటా’ంటూ కార్మికులను దూరంగా ఉంచుతున్నాడు,’’ అని మండిపడ్డారు.

వేతన బకాయిలు – కార్మికులకు తీవ్ర అన్యాయం

తులసీరామ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కో కార్మికుడు నెలకు పీఎఫ్‌తో సహా ₹12,382 వేతనం అందుకోవాల్సి ఉండగా, కేవలం ₹9,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆరోపించారు. పైగా పీఎఫ్ ఖాతాలు ఓపెన్ చేయకుండా, వారంతరపు సెలవులు, ఈఎస్‌ఐ, వీక్లీ హాలిడేలు వంటి న్యాయబద్ధమైన లబ్ధులను కూడా ఇస్తుండటంలేదని తెలిపారు.

డిపో మేనేజర్ జవాబుదారీగా ఉండాలని డిమాండ్

‘‘డిపో మేనేజర్ ఒక ప్రిన్సిపల్ ఎంప్లాయర్‌గా వ్యవహరించాల్సింది పోయి, కాంట్రాక్టర్ మాటలపై నడుచుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. ఇది అసహనానికి దారితీస్తోంది. డిపో మేనేజర్ – కాంట్రాక్టర్ సంధి అనుమానాస్పదంగా కనిపిస్తోంది,’’ అని తులసీరామ్ విమర్శించారు.

తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

ఈ సమస్యపై తక్షణమే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి చర్చలు జరిపి, కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, వేతన బకాయిలు పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నాలో సిఐటియు మండల కన్వీనర్ తెలగపల్లి శ్రీనివాసరావు, కార్మికులు ఎల్. మరియమ్మ, జి. మాణిక్యం, డి. ఉమా, ఎం. మరియమ్మ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :