- చలి మంట కాగుతూ ఘటన
కరీంనగర్ జిల్లా: చలి మంట కాగుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ వృద్ధురాలు మృతి చెందింది.. ఎస్సై నరేందర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన రామంచ నర్సవ్వ వయస్సు (85) సంవత్సరాలు ఆదివారం ఉదయం ఇంటిముందు ఉన్న పొయ్యిలో మంట పెట్టుకొని ప్లాస్టిక్ కుర్చీపై కూర్చొని చలిమంట కాగుతోంది. వేడికి కుర్చీ కాలు విరిగి వృద్ధురాలు మంటలో పడిపోవడంతో నర్సవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. మృతురాలి మనువడు బలరాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు.









