contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమెరికాలో తెలుగు యువతి హత్య… తమిళనాడులో నిందితుడి అరెస్ట్

అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న నిఖిత మాజీ ప్రియుడు అర్జున్ శర్మను తమిళనాడు పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇంటర్‌పోల్ జారీ చేసిన నోటీసుల ఆధారంగా అర్జున్ శర్మను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

మేరీల్యాండ్ రాష్ట్రంలో నివసిస్తున్న నిఖిత గొడిశాల హత్యకు గురైందన్న విషయం వెలుగులోకి రావడంతో స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిఖిత మృతదేహం ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో లభ్యమవడం కేసును మరింత సంచలనంగా మార్చింది. ప్రాథమిక దర్యాప్తులో నిఖితను హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని అపార్ట్‌మెంట్‌లో దాచిన అర్జున్ శర్మ అక్కడి నుంచి దేశం విడిచి భారత్‌కు పరారైనట్లు పోలీసులు గుర్తించారు.

అర్జున్ శర్మ కోసం మేరీల్యాండ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అతడు అమెరికా నుంచి భారత్‌కు పారిపోయినట్లు నిర్ధారణ కావడంతో ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు ఫెడరల్ అధికారుల సహకారం కోరారు.

ఇంటర్‌పోల్ నోటీసుల నేపథ్యంలో తమిళనాడు పోలీసులు అర్జున్ శర్మను గుర్తించి అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని అదుపులో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ తదుపరి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. నిఖిత హత్య కేసులో పూర్తి వివరాలు, నిందితుడి అప్పగింతపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఏం జరిగిందంటే..
మేరీల్యాండ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో తెలుగు యువతి నిఖిత గొడిశాల హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లోనే మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అర్జున్ శర్మే నిందితుడిగా భావించారు. అయితే హత్య అనంతరం అతడు భారత్‌కు పరారైనట్లు తేలడంతో ఇంటర్‌పోల్ నోటీసులు జారీ చేయగా, తాజాగా తమిళనాడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Nikitha Godishala అమెరికాలో తెలుగు యువతి హత్య.. తమిళనాడులో నిందితుడి అరెస్టు-Namasthe Telangana

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :