కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన కమటం రజని అలియాస్ హన్మండ్ల లావణ్య దేశవ్యాప్తంగా ఎన్ టి ఏ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్షలో ఇంగ్లీష్ సబ్జెక్టులో ఇటీవలన విడుదల చేసిన ఫలితాలలో పీహెచ్ డీ కి అర్హత సాధించారు. కమటం రజని గృహినిగా ఉండి యూజీసీ నెట్ లో అర్హత సాధించడం పట్ల ప్రజా కవి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్,సీనియర్ జర్నలిస్ట్ కొండమల్లు నవల, రచయిత వర్దేల్లి వెంకటేశ్వర్లు, కరీంనగర్ బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు ,తెలంగాణ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్, అనుమాండ్ల నర్సయ్య, అనుమాండ్ల రాజవీరు లు కమటం రజిని ని అభినందించారు.






