contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రహదారిపై వినూత్న నిరసన

కరీంనగర్ జిల్లా – గన్నేరువరం మండలం: హ్యాపీ హోలీ అంటూ రంగుల పండుగ జరుపుకుంటున్న పాలకుల మధ్య, గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డుపై “రక్త హోలీ” జరుగుతోందని వినూత్నంగా నిరసన తెలిపారు బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి.

హోలీ పండుగ సందర్భంగా రోడ్డుపై కూర్చొని మొహంపై రంగులు చల్లుకుని నిరసన వ్యక్తం చేశారు. గుండ్లపల్లి – పొత్తూరు రహదారి దుస్థితిని నిరసిస్తూ నడిరోడ్డుపై ఆందోళనకు దిగారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండ్లపల్లి నుండి పొత్తూరు వరకు ఉన్న ఈ డబుల్ రోడ్డు కోసం ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రతి ఎన్నికల సమయంలో హామీలు ఇస్తున్నా, ప్రతి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేస్తున్నా, ప్రజలకు మాత్రం ప్రమాదాలు, గాయాలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 71 కోట్ల రూపాయల జి.ఓ. తీసుకువచ్చి శంకుస్థాపన చేసి ప్రచారంతో సరిపెట్టుకుందని విమర్శించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే “100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తా” అని హామీ ఇచ్చి, ఉన్న రహదారిని చెడగొట్టి కంకర పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు.

నిత్యం కంకర రాళ్లు ఎగిరిపడి చిన్నారులు, వృద్ధులు గాయపడుతున్నారని అన్నారు. “నా మొఖంపై ఉన్న హోలీ రంగులా ప్రజల ముఖాలపై రక్తపు మచ్చలు పడుతున్నాయి. ఓట్లేసిన పాపానికి ప్రజలు రక్తం కళ్లతో చూడాలా?” అంటూ సీఎం **రేవంత్ రెడ్డి**ను ప్రశ్నించారు.

వర్షాకాలం వస్తే మండలం మొత్తం జలదిగ్బంధనానికి గురవుతుందని, అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ రహదారి కేవలం అసౌకర్యం కాదని – ఇది ప్రాణహాని అని పేర్కొన్నారు. వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :