నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని జీబీఆర్ (GBR) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు రోగులను పల్నాడు జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు.
మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన పచ్చిపాల చౌడయ్య, రెంటచింతల మండలం తుమృకోట గ్రామానికి చెందిన సయ్యద్ జమాల్ సైదా కుమార్తె షన్ను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందిస్తున్న వైద్య చికిత్స వివరాలను తెలుసుకుంటూ, రోగులకు అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి సూచించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు పార్టీ తరఫున తాము అండగా ఉంటామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.








