contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జియ్యమ్మవలస నూతన ఎంపీడీవోగా శశిభూషణరావు

జియ్యమ్మవలస, ఏప్రిల్ 25: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా హనుమంతు శశిభూషణరావు శనివారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన అధికారికంగా పదవిని చేపట్టారు.

ఇంతకుముందు ఇక్కడ ఎంపీడీఓగా పనిచేసిన కె. ధర్మారావు పదవీ విరమణ పొందగా, ఆయన అనంతరం డిప్యూటీ ఎంపీడీఓ హరిప్రసాద్ ఇన్చార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు హనుమంతు శశిభూషణరావును పూర్తి స్థాయి ఎంపీడీఓగా నియమించారు.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం శశిభూషణరావు మాట్లాడుతూ, మండల పరిధిలోని 31 గ్రామ పంచాయతీల కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తమ విధుల్లో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

అలాగే ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరవేయడంలో చిత్తశుద్ధితో పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు పాల్గొని నూతన ఎంపీడీఓకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :