contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డీ లిమిటేషన్ పిర్యాదు పై స్పందించిన ఎన్నికల కమీషన్

కాకినాడ: కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో డివిజన్ల పునర్విభజన (డీ-లిమిటేషన్) ప్రక్రియను చేపట్టాలని కోరుతూ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖపై స్పందన లభించింది. కోర్టు వ్యాజ్యాల కారణంగా డీ-లిమిటేషన్ చర్యలు నిలిచిపోయాయని, ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66 డివిజన్లుగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్లు 165, 175, 176ను అమలు చేయాలని సంఘం తన లేఖలో కోరింది.

ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదును తక్షణమే స్వీకరించి, సంబంధిత అంశంపై పరిష్కార చర్యలు చేపట్టి, తీసుకున్న చర్యలను ప్రకటించాలని ఎన్నికల సంఘం సూచించినట్లు వెల్లడించారు.

ఎన్నికల సంఘం నుంచి శనివారం సాయంత్రం రిజిస్టర్డ్ లేఖ ద్వారా సమాధానం అందిందని, దీనిపై పౌర సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన డివిజన్ల పునర్విభజనపై ఇకపై కాలయాపన లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది.

కోర్టు కేసుల నుంచి ప్రభుత్వం సంబంధిత అంశాన్ని సెక్షన్ 3 ప్రకారం విముక్తి చేసి, కాకినాడ నగర పాలక సంస్థలో సెక్షన్ 65 ప్రకారం కొత్త డివిజన్లను ఏర్పాటు చేసి ఎన్నికలకు సన్నద్ధం చేయాలని పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి రమణరాజు డిమాండ్ చేశారు.

ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా జాప్యం చోటుచేసుకున్నా, హైకోర్టును ఆశ్రయించడంతో పాటు రాజ్యాంగబద్ధమైన ప్రజా ఉద్యమం చేపట్టేందుకు పౌర సమాజం సిద్ధంగా ఉందని రమణరాజు స్పష్టం చేశారు.

కాకినాడ నగర పాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన, ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘం స్పందించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :