contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అంగన్వాడీ వర్కర్ల పదోన్నతులపై ఏపీ హైకోర్టు స్టే ….

AP: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులను అర్హులైన కాంట్రాక్టు కార్మికులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సూపర్‌వైజర్ల నుంచి భర్తీ చేయాల్సి ఉంది. పోస్టులకు అర్హత డిగ్రీ. సెప్టెంబర్ 18న 38 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు రాత పరీక్షకు హాజరయ్యారు. అనంతరం మౌఖిక పరీక్ష నిర్వహించారు.

రాత పరీక్షకు 45 మార్కులు, మౌఖిక పరీక్షకు ఐదు మార్కులు. అయితే ఈ పోస్టుల భర్తీలో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని, తక్షణమే పరీక్షా ఫలితాలను నిలిపివేయాలని కోరుతూ బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటీషన్‌ దాఖలైంది. జీవో ప్రకారం.. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌లను నియమించేటప్పుడు రాత పరీక్షలతో పాటు ఇంగ్లీష్ ప్రావీణ్యత పరీక్షలను నిర్వహించడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను ప్రభుత్వ అధికారులు ఉల్లంఘించారని, మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని ఎంపిక చేస్తున్నారని కొందరు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :