కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం: భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ సస్పెన్షన్ నిరసిస్తూ మండలం లోని గుండ్లపల్లి స్టేజి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా అధికార ప్రతినిధి ముల్కల మల్లేశం మాట్లాడుతూ… దేశ ప్రజల ఐక్యత కోసం,జాతీయ సమైక్యత కాపాడటం కోసం కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ను నిర్వహించారని,ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాధారణ ను చూసి ఓర్వలేని భాజపా ప్రభుత్వం కక్షపూరితంగా ఆయన్ని పార్లమెంట్ నుండి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని దుయ్యబట్టారు. సిబిఐ, ఈడి లాంటి దర్యాప్తు సంస్థలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రశ్నించే ప్రజా గొంతుకలపై ఉసి గొల్పుతూ పబ్బం గడుపుతున్న బి.జె.పి నాయకులకు త్వరలోనే దేశ ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు.రాహుల్ గాంధీ సస్పెన్షన్ ను వెంటనే ఎత్తి వేయాలని,లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు చాడ సతీష్ రెడ్డి, సింగిరెడ్డి రవీందర్ రెడ్డి, గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్, చీమలకుంటపల్లి గ్రామాల అధ్యక్షులు బొల్లి శంకరయ్య,సిందె చందర్, బామాండ్ల ఆంజనేయులు, నాయకులు మాచర్ల శంకర్, చాడ లింగారెడ్డి,ఎర్రల రాజయ్య,దొమ్మటి మల్లయ్య, వంగల ముత్తిరెడ్డి,బొల్లి రవీందర్,కల్లూరి రాము, బామాండ్ల అంజేందర్,చెవుల నర్సయ్య,కనగర్తి రమేష్,ఎండి రహీం,గాలిపెళ్లి పోచయ్య తదితరులు పాల్గొన్నారు.