contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు శుభవార్త !

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు పథకాలను అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు హామీని అమలు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు, వృద్ధులకు కొత్త సంవత్సరం బహుమతి ఇవ్వనుంది. మరో రెండు హామీలను అమలులోకి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్, చేయూతలో భాగంగా పెన్షన్ రూ.4వేలకు పెంపు హామీలను అమలు చేసే యోచనలో ఉంది. ఈ మేరకు గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరు గ్యారెంటీలలో తదుపరి హామీల అమలుపై చర్చించారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెండు హామీలను డిసెంబర్ 28వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. దీంతో మహిళలు, వృద్ధులకు ప్రయోజనం చేకూరనుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :