రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. తెలంగాణ లో ప్రతి 17 మంది మంత్రుల్లో 10 మంది పై తీవ్ర క్రిమినల్ కేసులుంటే.. మొత్తం మీద 13 మంది మంత్రులపై ఏదో విధమైన క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ విడుదల చేసిన రిపోర్ట ద్వారా వెలుగులోకి వచ్చాయి. దీన్ని పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రుల్లో 59 శాతం మంది తీవ్రమైన క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు.
మంత్రులపై తీవ్ర క్రిమినల్ కేసుల పరంగా మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రంలో మొత్తం 20 మంది మంత్రులకు గాను 13 మంది అంటే 65 శాతం తీవ్ర క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఝార్ఖండ్ రాష్ట్రంలో 11 మంది మంత్రులుంటే ఏడుగురిపై సీరియస్ క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. మూడో స్థానంలో తెలంగాణ ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలలో 558 మంత్రులకు గాను 486 మంది మంత్రులు కోటీశ్వరులుగా ఉన్నారు. వీరిలో 239 మంది తమపై క్రిమినల్ కేసులు నమోదైనట్టు ప్రకటించారు. తమిళనాడులో 33 మంది మంత్రులకు గాను 28 మంది, హిమాచల్ ప్రదేశ్ లో 9 మందికి ఏడుగురు, తెలంగాణలో 17 మంత్రులకు 13 మంది, మహారాష్ట్రలో 15 మంది మంత్రులు, పంజాబ్ లో 11 మంది మంత్రులు బీహార్ లో 30 మంది మంత్రులకు గాను 21 మంది తమ అఫిడవిట్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించారు.
అయితే సగటున ఒక్కో మంత్రికి 16.63 కోట్ల ఆస్తులు ఉన్నాయి. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారి దగ్గర 21.21 కోట్ల చొప్పున ఆస్తులు ఉన్నాయి. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కో మంత్రి సగటున 73 కోట్ల చొప్పున ఆస్తులు కలిగి ఉన్నారు.