contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కొడుకు కాపీకొట్టడానికి స్లిప్పులు ఇవ్వడానికి వెళ్లి తన్నులు తిన్న తండ్రి

మహారాష్ట్ర : కొడుకు పరీక్ష పాస్ కావడానికి స్వయంగా ఓ తండ్రే స్లిప్పులు అందించే ప్రయత్నం చేశాడు. పరీక్షా కేంద్రానికి వెళ్లి కొడుకుకు సాయం చేయాలని చూశాడు. అది చూసి పోలీసులు తమ చేతిలోని లాఠీలకు పనిచెప్పారు. మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జల్గావ్ జిల్లా చోప్రా తహసీల్‌ అడవాడ్ గ్రామంలోని నూతన్ జ్ఞాన మందిర్ విద్యాలయంలో విద్యార్థులు మరాఠీ పరీక్ష రాస్తున్నారు. ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న తన కొడుకుకు సాయం చేయాలని ఓ తండ్రి నిర్ణయించుకున్నాడు. కొన్ని స్లిప్పులు పట్టుకుని పరీక్షా కేంద్రం దగ్గరికి వెళ్లాడు. తన కొడుకు ఏ గదిలో ఉన్నాడోనని వెతుకుతుండగా విధుల్లో ఉన్న పోలీసులు గమనించి హెచ్చరించారు. అక్కడి నుంచి దూరంగా పంపించారు.

కాసేపటికి ఆ తండ్రి మరోమారు ప్రయత్నించేందుకు పరీక్ష కేంద్రం దగ్గరికి వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడంతో విడిపించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు చెప్పినా వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పారు. సదరు తండ్రిని ఓ పోలీస్ అధికారి లాఠీతో చితకబాదాడు. ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్నవారు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :