contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్థాన్ ను 159 పరుగులకు పరిమితం చేసిన టీమిండియా

మెల్బోర్న్ లో పాకిస్థాన్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు సత్తా చాటారు. ఈ సూపర్-12 మ్యాచ్ లో పాకిస్థాన్ ను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేశారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, హార్దిక్ పాండ్యా 3, భువనేశ్వర్ కుమార్ 1, మహ్మద్ షమీ 1 వికెట్ తీశారు.

పాక్ బ్యాటింగ్ లైనప్ లో షాన్ మసూద్, ఇఫ్తికార్ అహ్మద్ అర్ధసెంచరీలతో రాణించారు. ముఖ్యంగా ఇఫ్తికార్ అహ్మద్ భారీ సిక్సర్లతో విరుచుకుపడడంతో పాక్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. ఇఫ్తికార్ 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు.

ఓ దశలో పాక్ భారీ స్కోరు దిశగా సాగుతుండగా, ఇఫ్తికార్ అహ్మద్ ను షమీ అవుట్ చేయడంతో పరిస్థితి భారత్ నియంత్రణలోకి వచ్చింది. చివర్లో షహీన్ అఫ్రిదీ ధాటిగా ఆడి 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 52 పరుగులతో అజేయంగా నిలిచాడు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :