contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

 contact@thereportertv.com
+91 9492986819, +91 9493291809

  contact@thereportertv.com  |   +91 9492986819  |  +91 9493291809

నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలైపోయింది : రేవంత్ రెడ్డి

  • వాటాలీవ్వాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరింపులు
  • పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరించారన్నారు

నిజామాబాద్ జిల్లా : నందిపేట మండల కేంద్రంలో హాత్ సే హాత్ జోడో యాత్రతో భాగంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి లక్కంపల్లి సేజ్ ను పరిశీలించారు  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసింది తెలిపారు ఇందులో
పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016 బీజేపీ ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చిందని పేర్కొన్నారు తెలంగాణ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బెదిరించారన్నారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవన్నారు. జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలైపోయిందని ఫైర్ అయ్యారు. సీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదన్నారు అక్కడ ఇలాంటి పనులు జరగడం లేదన్నారు అలాగే అభివృద్ధి కనబడడం లేదని తెలిపారు ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు 30శాతం కప్పం కట్టవలసింది అని హుకుం జారీ చేశారని ఆరోపించారు అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డి అని ఈ ప్రాంత రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు బిజెపి ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు..

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :