గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ‘హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర’ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ గన్నేరువరం మండల కార్యవర్గ సమావేశం శనివారం నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షుడు తిప్పర్తి నిఖేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంగ నరేష్ మాట్లాడుతూ ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటిపై జాతీయ మువ్వన్నెల జెండాను ఎగురవేసేలా ప్రజలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
తిరంగా యాత్రలో యువత, మహిళలు, రైతులు, వివిధ వర్గాల ప్రజలను భాగస్వాములను చేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని అన్నారు. గన్నేరువరం మండలంలో జాతీయ జెండా లేని ఇల్లు ఉండకూడదనే లక్ష్యంతో కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.
భవిష్యత్ తరాలకు దేశభక్తి, జాతీయ జెండా ప్రాధాన్యతను తెలియజేసేలా చిన్నారులను సైతం కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సంగ నరేష్ కోరారు. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతి బూత్, ప్రతి వార్డులో కార్యక్రమాలు
బీజేపీ గన్నేరువరం మండల అధ్యక్షుడు తిప్పర్తి నిఖేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని గన్నేరువరం మండలంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.
ప్రతి బూత్, ప్రతి వార్డు, ప్రతి ఇంటికి జాతీయ పతాకం చేరేలా పార్టీ కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. తిరంగా యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, గునుకుల కొండాపూర్ గ్రామ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, మండల సీనియర్ నాయకులు ఎలేటి చంద్రారెడ్డి, బండి తిరుపతి, గన్నేరువరం 8వ వార్డు సభ్యుడు మచ్చ సాయికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శులు బొమ్మాడి సురేందర్ రెడ్డి, పుల్లెల రాము, మండల కార్యదర్శులు సీహెచ్ చంద్రయ్య, బూట్ల సంపత్, నాయకులు మునిగంటి సత్తయ్య, పుల్లెల జగన్ మోహన్, రామకృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు మునిగంటి లింగయ్య, జీల ఎల్లయ్య, బూత్ అధ్యక్షులు కొంకటి రవీందర్, విలాసారం రాయమల్లు, దానవేణి ప్రశాంత్, కర్ర శ్రీకాంత్, కూన ప్రశాంత్, జైపాల్ రెడ్డి, రాకేష్, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.








