- ఇంటి వద్దకే 7000 పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కారంపూడి పట్టణ అధ్యక్షుడు కటికల బాలకృష్ణ
పల్నాడు జిల్లా, కారంపూడి : తమకి పెన్షన్ పెంచుతూ అది ఇంటి వద్దకే వచ్చి డబ్బులు ఇచ్చి ప్రతి పేదవాడి ఇంటికి తమ ఇంటికి పెద్దకొడుకుగా బాధ్యత గా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పెన్షన్ దారులు వృద్ధులు పాలాభిషేకం చేశారు. పెన్షన్ మంజూరు పంపిణీ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రాహ్మరెడ్డి పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో ఎన్నికలకు ముందే ప్రకటించిన విధంగా 7000 పెన్షన్ పంపిణీ తో కార్యక్రమం ప్రతి ఊరిలో ప్రతి వీధిలో పండగ వాతావరణం నెలకొంది అర్హులైన ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోను నిర్వహించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కారంపూడి లో పట్టణం టిడిపి అధ్యక్షుడు కటికల బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరుపేదలకు వృద్ధులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కటికల బాలకృష్ణ మాట్లాడుతూ ముందుగా తమ అధినేత ప్రకటించిన విధంగా పెన్షన్ 7000 రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేశామని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఎవరు ఎటు తిరగాల్సిన పని లేకుండా తమ ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామ ని రానున్న రోజుల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉంటామని ప్రజల సేవ చెయ్యడమే తమ ధ్యేయమని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు తండా మస్తాన్ జానీ .ఎస్టీ మండల అధ్యక్షుడు బాలు నాయక్ నాగేటి హనుమయ్య తోకల శరత్ మరియు పట్టణ మండల టిడిపి నేతలు జనసేన నాయకులు పాల్గొని పంపిణీ కార్యక్రమం జయప్రదం చేశారు.