- చట్టం పట్ల అవగాహన కల్గిన విద్యావంతున్ని,సామాజిక కార్యకర్తను RTI ACT కమిషనర్ గా నియమించండి.
- తెలంగాణ గవర్నర్ కు ముఖ్యమంత్రి కి, ప్రధాన కార్యదర్శి కి లేఖలు వ్రాసిన ఉభయ తెలుగు రాష్ట్రాల సి సి ఆర్ ప్రతినిధులు.
కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ (సిసిఆర్)తిరుపతి జిల్లా నుండి లీగల్ అడ్వయిజర్ దినేష్, జిల్లా కో ఆర్డినేటర్, మాజీ సైనిక ఉద్యోగి మార్కండేయరెడ్డి, మహిళా అధ్యక్షురాలు కె గిరిజ,రాష్ట్ర కమిటీ సభ్యులు తులసీదాస్,ఏపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ గుత్తి త్యాగరాజు, జి శిరీష్ బాబు,వారి వారి ప్రాంతం నుండి లేఖలు వ్రాసి, భారత తపాల శాఖ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేసి తెలంగాణ గవర్నర్ కు,రాష్ట్ర ముఖ్యమంత్రి కి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి పంపడం జరిగిందని సీసీఆర్ జె ఎస్ గుత్తి త్యాగరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రలలో సీసీఆర్ అను సంస్థ ద్వారా, గ్రామీణ ప్రజలకు సైతం అవగాహన కలిగే రీతిలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలను లేఖలో పొందుపరిచారు.
అనేక చోట్ల చేపట్టిన రికార్డుల పరిశీలన లో వెలుగు చుసిన అంశాల గురించి కూడా లేఖలో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ సమాచార హక్కు చట్టం పట్ల పూర్తి స్థాయిలో ప్రజలు అవగాహన పెంచుకుని, ప్రభుత్వం వద్ద, ప్రభుత్వ అధికారులు వద్ద జవాబు దారి తీసుకురావడం, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి తొడ్పాడుటకు సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకోవలసిన అవసరము కొఱకు,కౌన్సిల్ ఫర్ సిటిజెన్ రైట్స్ వ్యవస్థపాక అధ్యక్షులు మంచికట్ల అనిల్ కుమార్ పేరును,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు సిపారసు చేస్తూ లేఖను పంపడం జరిగిందని,ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి అనేకమంది సిపారసు లేఖలు పంపారని సీసీఆర్ జె ఎస్ గుత్తి త్యాగరాజు తెలిపారు.చట్టం పట్ల అవగాహన లేని వారిని కమిషనర్ గా నియమించడం వల్ల, వారు వాటిని గురించి తెలుసుకునే లోపే వారికి ఉన్న సమయంలో 70% పూర్తి అవుతుందని,తద్వారా ప్రభుత్వ ఆశయంకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని, మరికొందరు వారిని తప్పు దారి పట్టీంచే అవకాశం ఎక్కువగా ఉందని,దాని వలన ప్రభుత్వం అప్రతిష్ట మూట కట్టుకోవలసి వస్తుందని సీసీఆర్ తిరుపతి జిల్లా సభ్యులు కొందరు తమ అభిప్రాయం వెలిబుచ్చారు. విజయవాడ కేంద్రంగా రాష్ట్ర స్థాయి సీసీఆర్ కార్యాలయంను ప్రారంభించే దిశగా రాష్ట్ర సీసీఆర్ ప్రతినిధులు అడుగులు వేస్తున్నట్టు తెలిపారు