contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మంత్రి నిరంజన్ రెడ్డి ఇలాఖలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

  • మంత్రి ఇలాఖలో…. మళ్ళీ రెచ్చిపోతున్న ఇసుక మాఫియా
  •  మామూళ్లు మత్తులో పోలీస్, రెవిన్యూ, మైనింగ్ అధికారులు
  •  అంతాయపల్లిలో….అంతా అక్రమ దందా
  •  నీళ్ల నిరంజన్ రెడ్డా…. ఇసుక మాఫియా నిరంజన్ రెడ్డా….?
  •  ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి పేరిట…. అక్రమ దందా
  •  మాఫియాపై కేసులు నమోదు చెయ్యాలి
  •  ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు పోరాడుతం
  •  సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్

మంత్రి నిరంజన్ రెడ్డి సొంత ఇలాఖలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారని, వనపర్తి జిల్లా ఘణపురం మండలం అంతాయపల్లి గ్రామ శివారులో వాగు నుండి ప్రతిరోజు 50 నుంచి 60 భారత్ బెంజ్ లతో కనీసం రెండు నుంచి మూడు ట్రిప్పులు నేపథ్యంలో 100 నుంచి 200 లారీల ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం నేనుసైతం స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోట్లాది రూపాయల విలువల చేసే ఖనిజ సంపద ఇసుకను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా… వందలాది లారీలతో ఇతర జిల్లాలకు తరలిస్తున్న…. అటువైపు రెవెన్యూ…. పోలీస్…..,మైనింగ్…ఇతర శాఖల అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడం విడ్డురంగా ఉందన్నారు. ఇక్కడ ఇసుక మాఫియా చెప్పిందే చట్టం……..చేసిందే న్యాయం అన్న చందంగా….మాఫియా నీడలో …..మామూళ్ళ మత్తులో కొందరు పోలీస్, రెవెన్యూ అధికారులు తూగుతుంటే…..మొద్దు నిద్రలో మైనింగ్ శాఖ ఉండడంతో… కోట్లాది రూపాయల ప్రజాధనం ఊటీ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై ఘణపూర్ తహసిల్దార్, ఘణపూర్ ఎస్సై, మైనింగ్ శాఖ ఏడీలకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించిన వారు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా మాఫియా ఏ ఒక్క అధికారికి భయపడకుండా గ్రామ శివారుల నుండి పట్టపగలు ఇసుకను అంతాయపల్లి, గుంపోలు గుట్ట, కమాజీపూర్, తిరుమలయపల్లి, పాత మోల్గర, కొత్త మోల్గర, గోపులాపూర్ మీదుగా భూత్పూర్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న…. కనీసం పోలీసు, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఆ అక్రమ ఇసుకను సీజ్ చేసేందుకు జంకుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. దాదాపు 50 నుండి 60 భారత్ బేంజ్ ల ఇసుకను అక్రమంగా జిల్లా సరిహద్దులు దాటి ఇతర జిల్లాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న స్ధానిక రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడం చూస్తే వారి చిత్తశుద్ది ఏ మాత్రం ఉందో స్పష్టమవుతుందన్నారు. అంతేకాకుండా ఇసుక మాఫియా ఇచ్చే ఆమ్యాయాలకు అలవాటు పడ్డ కొందరు అధికారులు ఇసుక మాఫియాకు బహిరంగంగా మద్దతిస్తూ మాఫియాను అడ్డుకోకపోగా, ప్రత్యక్షంగా ఇసుకను అక్రమంగా తరలించేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలకు పెద్దఎత్తున వినిపిస్తున్నాయన్నారు.

ఇకనైనా వెంటనే ఘణపూర్ మండలంలోని అంతయాపల్లి గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు వందలాది ట్రిప్పుల ఇసుకను వెంటనే రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖ అధికారులు సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటి చేస్తూ పక్క జిల్లాలకు తరలిస్తున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘాణపూర్ ఎస్ఐ తో పాటు సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నేనుసైతం స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో ఉధ్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

కలెక్టర్ కు ” నేనుసైతం ” ఫిర్యాదు

వనపర్తి జిల్లా ఘణపురం మండలం అంతాయపల్లి గ్రామ శివారులో అక్రమంగా ఇసుక రవాణా నిర్వహిస్తున్నారని వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ భాషాకు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా వందలాది భారత్ బెంజ్ లతో ఇసుకను అక్రమంగా తరలిస్తూ, జిల్లా సరిహద్దులు దాటి కోట్లాది రూపాయల ఇసుకను కొల్లగొడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సాక్షాదారులతో ఫిర్యాదు చేయాలని, చేస్తే ఇసుక మాఫియాతో సంబంధం ఉన్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటానని, అంతేకాకుండా
ఈ విషయమై ఎస్పీతో మాట్లాడి ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపేవరకు…. ఉధ్యమిస్తాం: ప్రవీణ్ కుమార్

హైదరాబాద్ కు చెందిన ఓ మాజీ పోలీసు ఉన్నతాధికారి పేరు చెప్పుకొని అంతయాపల్లిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, కలెక్టర్ జోక్యంతోనైన వనపర్తి జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టాలని సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్చంద సంస్ద అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇకనైన వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ భాషా స్పందించి,
ఇసుక మాఫియాను, మాఫియాకు సహకరిస్తున్న సంబంధిత క్షేత్ర స్థాయి అధికారులను కట్టడి చేయకపోతే, మరో సారి రాష్ర్ట అత్యున్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించి ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :