తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతం లోని దేవరకొండ మెయిన్ రోడ్డు లో 32 ఎర్రనచందనం దుంగలు ఒక మోటార్ సైకిల్ మరో లగేజి వాహనం స్వాదీనం చేసుకొని ఇద్దరు స్మగ్లర్ లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ జి బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వం లో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన టీమ్ లోని ఆర్ఎస్ఐ కేఎస్ కె లింగాధర్ స్థానిక ఎఫ్బీఓ వై రాజేశ్ కుమార్ తో కలసి దేవరకొండ వైపు గల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు అయితే రాబడిన సమాచారం మేరకు తుమ్మచేనుపల్లీ మట్టి రోడ్డు వద్ద కు చేరుకోగా మోటార్ సైకిల్ పై ఒక వ్యక్తి కనిపించాడు. ఆ వాహనాన్ని అనుసరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఒక లగేజి వాహనం కనిపించింది ఆ వాహనాన్ని చుట్టు ముట్టడం తో అందులోని స్మగ్లర్లు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని పట్టుకోగలిగారు. లగేజి వాహనం తనిఖీ చేయగా అందులో 32 ఎర్రచందనం దుంగలు లబించాయి పట్టుబడిన వారిని ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన వారుగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలు తో సహ వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరిలించారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగలు విలువ రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
